NDL: డోన్ పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనో స్కాన్స్ సెంటర్ ను ఆదివారం టీడీపీ యువ నేత కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వైద్య సేవలు ప్రజలకు చేరువ కావడం అవసరమన్నారు. స్కానింగ్ కేంద్రాలు ప్రజలకు మెరుగైన నిర్ధారణ సేవలు అందించడంలో కీలకమని పేర్కొన్నారు.