VZM: జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో తోటపల్లి బ్యారేజ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేసి, ప్రభుత్వ భూములను త్వరగా అప్పగించాలన్నారు.