KRNL: కౌతాళం గ్రామ పంచాయతీ బండిమెట్ట, కమేళ, దినసరి మార్కెట్లకు ఏప్రిల్ 2న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు MPDO గోపాల్, సర్పంచ్ దినకర్, PS యోగేశ్వర్ తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నగదు డిపాజిట్ చేసి పాల్గొనాలని సూచించారు. బండిమెట్ట రూ.1.50 లక్షలు, కమేళాకు రూ.40,000, దినసరి మార్కెట్కు రూ.15,000 డిపాజిట్ చెల్లించాలన్నారు.