WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో రూ.88 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మెగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుతూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని అన్నారు.