SKLM: రాష్ట్రంలో పల్లెటూర్లను అందంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. పొందూరు మండలం లైదం గ్రామంలో కోటి 34 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిగిరిపల్లి రామ్ మోహన్, టీడీపీ యువత జనరల్ సెక్రటరీ బలగ శంకర్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.