NZB: మెండోరా మండలం పోచంపాడ్లో ‘ప్రజా పాలన’లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ మాధురి రాజు, డాక్టర్ రాకేష్ శిబిరాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ నిపుణులు కంటి, ఎముకలు, దంత పరీక్షలు చేశారు. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.