BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి పై బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలుపై కొత్వాల మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి నిజాయితీకి నిదర్శనమని, అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న మహానేత అని అన్నారు.