BHNG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. చిన్నకొండూర్కు చెందిన బొంగు నర్సింహకు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూశారు. సుమారు రూ. 2.50 లక్షల ఖర్చుతో ఆపరేషన్ చేయించి ప్రాణాలు కాపాడారు. ఈ సాయానికి నర్సింహ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.