KMR: కులం పేరుతో దూషించడంతో పాటు దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ ఎస్సీ/ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది. 2022లో కామారెడ్డికి చెందిన నర్సింలు, శ్యామ్, రాజు అనే వ్యక్తులు వ్యాపార గొడవలతో బాలు నాయక్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి, భౌతిక దాడికి పాల్పడ్డారని బాలు ఫిర్యాదు చేశారు.