AP: రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. రేపు లోక్సభలో కేంద్ర హోంశాఖ బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు లోక్సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లును చేర్చారు. లోక్సభ ఆమోదం తర్వాత రాజ్యసభ ముందుకు ఈ బిల్లు వెళ్లనుంది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో కేంద్రం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.