IPL మ్యాచుల బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్గా పనిచేస్తున్న జాన్ విలియమ్ మృతిచెందాడు. మార్చి 29న మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబైలోని ఓ హోటల్లో తన గదికి వెళ్లిన జాన్.. రిసెప్షన్ నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా స్పందించకపోవడంతో ఎమర్జెన్సీ కీతో సిబ్బంది గదిని తెరిచి చూశారు. అప్పటికే జాన్ మృతిచెందాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.