NDL: సిరివెళ్ల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం ప్రిన్సిపల్ జ్యోతి ఆకస్మికంగా మృతి చెందారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించడంలో ఆమె కృషి చేసేవారని స్థానికులు తెలిపారు. ఆమె మరణంతో పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.