TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన “నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత” అంశంపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నీటి సంరక్షణతోనే భవిష్యత్తు సురక్షితమని, భూగర్భ జలాల పునరుద్ధరణకు సమిష్టి కృషి అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయమ్మ, నీటిపారుదల ఏఈ ఎన్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి ఆర్ గౌరీ పాల్గొన్నారు.