సత్యసాయి: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి (వీసీ) జ్యోతి కుమార్ను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి కూడా వీసీని కలిసి అభినందనలు తెలియజేశారు.