ELR: ఏలూరు అమీనా పేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పోలీస్ స్కూల్ ప్రక్కన గల కళ్యాణ మండపంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు శనివారం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో నేత్ర వైద్యం, పీడియాట్రిక్ జనరల్ మెడిసిన్స్ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.
CTR: వెదురుకుప్పం మండలం చిన్ననక్కలపల్లి గ్రామంలో శనివారం నగరి DSP మహమ్మద్ సయ్యద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. DSP మాట్లాడుతూ.. తనిఖీలలో సరైన రికార్డులు లేని 40 స్కూటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నాటు సారా తయారు చేసినా, అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ హనుమంతప్ప, ఎస్సై రాజకుమార్ సుమన్, సిబ్బంది పాల్గొన్నారు.
కడప: వీరపునాయనపల్లి మండలం నేలతిమ్మయ్యగారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లి మండలం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బాల వీరయ్య మృతి చెందాడు. ముకుంద ట్రావెల్స్కు చెందిన బస్సు కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108లో సమీప ఆసుపత్రికి తరలించారు.
కడప: వీరపునాయునిపల్లి మండలం నేలతిమ్మయ్యపల్లి సమీపంలో శనివారం ఉదయం కూలీల ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఏడుగురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి వేంపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు.
CTR: రూరల్ మండలం దిగువమాసపల్లె గ్రామపంచాయితీ పరిధి హరిజనవాడలో శనివారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకేసారి పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని MLA అన్నారు.
GNTR: మంగళగిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఏఈ సురేశ్ తెలిపారు. ఉదయం 8:30 నుంచి 11:30గంటల వరకు పట్టణంలోని గండాలయ్యపేట, కొత్తపేట, ఆర్ అండ్ బీ బంగ్లా రోడ్, హాస్పిటల్ రోడ్, మెయిన్ బజార్, ఎయిమ్స్ గేట్, ఎకో పార్క్, ఎల్.బి నగర్, ఆంజనేయ కాలనీ, క్యాంప్ ఏరియా, విప్పటం రోడ్డు, భగత్ సింగ్ నగర్లలో పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు.
VSP: కసింకోటలో ఈనెల 3వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు పి.సూర్యనారాయణ, కార్యదర్శి గోపి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలోని ఓ ఫౌండేషన్ కంటి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్నవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
VSP: శ్రీకాకుళంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థిని లైంగికదాడి ఆరోపణల ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డితో ఫోన్లలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రిమ్స్లో ఉన్న యువతికి మెరుగైన వైద్య సదుపాయాలందించాలని ఆదేశించారు. నిందితుల కోసం ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హోం మంత్రికి వివరించారు.
CTR: చౌడేపల్లె మండలంలోని శెట్టిపేట పంచాయితీ ఎర్రపల్లెలో వెలసిన శ్రీ బసవేశ్వర స్వామి ఆలయంలో శనివారం మాఘమాసపు తొలివారం పూజలను వేడుకగా నిర్వహించారు. మహిళలు వేకువజామున ఆలయం వద్దకు చేరుకొని ఆలయంను శుద్ధి చేసి స్వామి వారి దంపతులకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. వర్షాలు, పంటలు బాగా పండాలని, వృద్ధి చెందాలని కోరుతూ స్వామివారికి మొక్కులు చెల్లించారు.
NTR: గంపలగూడెం మండలంలో గంపలగూడెం, ఉటుకూరు, నెమలి, తునికిపాడు, వినగడప, రాజవరం తదితర గ్రామాల్లో శనివారం ఉదయం సామాజిక పింఛన్ పంపిణీ ప్రారంభించారు. పెనుగొలనులో సచివాలయ, పంచాయతీ, ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ నగదును అందజేశారు. ఇంటింటికీ వచ్చి 1వ తేది పెన్షన్లు ఇవ్వటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
NTR: ఐర్లాండ్ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన యువకుడు, అతని మిత్రుడు శుక్రవారం రాత్రి మృతిచెందారు. గండ్రాయి గ్రామానికి చెందిన భార్గవ్ ఐర్లాండ్ దేశంలో చదువుకుంటూ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కారులో వెళుతుండగా మంచు కురవటంతో కారు చెట్టును ఢీకొని ప్రమాదానికి గురైంది. తన మిత్రుడు అక్కడికక్కడే మరణించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
విశాఖలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు MVP పోలీసులు తెలిపారు. మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో MVP పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేసినట్లు పేర్కొన్నారు.
VSP: వాల్తేర్ డివిజన్లో సాంకేతిక కారణాలతో పలు రైళ్ల గమ్యం కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పార్వతీపురం(67287/88)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 విజయనగరం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పార్వతీపురానికి బదులుగా విజయనగరం నుంచి బయలుదేరుతుందన్నారు.
Akp: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పద జాలంతో పోస్టులు పెడుతున్న మడుతూరుకు చెందిన వైసీపీ నాయకుడు గోవిందుపై జనసేన నాయకులు అచ్యుతాపురం సీఐ గణేష్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరును చెడగొట్టాలనే లక్ష్యంతో తప్పుడు రాతలు రాస్తూన్నారన్నారు.
VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కోడ్ గురించి ప్రతినిధులకు వివరించారు. పలు శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.