• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కోతుల దాడిలో మహిళ మృతి.!

KKD: పెద్దిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. చిన్న బుల్లి (68) అనే మహిళ పొలంలో గేదేలు మేపుతుండగా కోతులు గుంపు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన ఆమె రక్త స్రావంతో తప్పించుకోవడానికు పరిగెడుతూ.. కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమె దగ్గర చేరుకునేసరికే మృతి చెందింది. కోతుల బెడదపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చర్యలు చేపట్లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 21, 2026 / 08:15 PM IST

గన్నవరం, రామవరప్పాడులో కొత్త పోలీస్ స్టేషన్లు

కృష్ణా: శాంతిభద్రతల బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. శనివారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో సమీక్ష నిర్వహించారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌ను రూ.3 కోట్లతో ఆధునిక G+3 భవనంగా నిర్మిస్తామని చెప్పారు. రామవరప్పాడులో కొత్త స్టేషన్ ఏర్పాటు చేసి 9 గ్రామాలకు సేవలు అందిస్తామని వెల్లడించారు. CSR, NRI నిధులతో పనులు చేస్తామన్నారు.

March 21, 2026 / 08:15 PM IST

వైసీపీ నుంచి బీజేపీలోకి చేరికలు

KRNL: వైసీపీ నుంచి బీజేపీలోకి భారీ చేరికలు జరిగాయి. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకుడు పెద్ద కొండయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో ఇవాళ కండువాలు కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పార్థసారథి సారథ్యంలోనే సాధ్యమని నమ్మి పార్టీలో చేరినట్లు లక్ష్మారెడ్డి, హనుమయ్య, విశ్వనాథ్ రెడ్డి, బంగారయ్య తెలిపారు.

March 21, 2026 / 08:15 PM IST

శాఖల పనితీరుపై సమీక్షించిన జడ్పీ ఛైర్మన్

VZM: మెరకముడిదాం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో శనివారం శాఖల పనితీరుపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని, విద్యుత్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకి సూచించారు. 

March 21, 2026 / 08:12 PM IST

మహిళల భద్రతకు రక్షణ కవచం “శక్తి యాప్”: ఎస్సై

KDP: మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ‘శక్తి యాప్’ ఎంతో కీలకంగా మారుతుందని జిల్లా రిమ్స్ ఎస్సై సుభాశ్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఇవాళ జిల్లాలోని శిల్పారామంలో సందర్శకులకు ఈ యాప్ ఆవశ్యకతపై ఆయన అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ యాప్ ద్వారా లభించే సేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించారు.

March 21, 2026 / 08:11 PM IST

‘అరటి పంటను పరిశీలించిన రైతు సంఘం’

NDL: ప్యాపిలి మండలం పీఆర్ పల్లిలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ఏపీ రైతు సంఘం నేతలు అరటి పంటను ఇవాళ పరిశీలించారు. యుద్ధ ప్రభావంతో టన్ను రూ.20 వేల ధర, రూ.4 వేలకే పడిపోయిందని పేర్కొన్నారు. కోతకు వచ్చిన పంటను అమ్మలేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.23 వేల గిట్టుబాటు ధర ఇచ్చి, డోన్ మార్కెట్ శీతల గోదాంలలో నిల్వ చేయాలని కోరారు.

March 21, 2026 / 08:03 PM IST

కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది: ఎంపీ

PLD: ఈపూరు మండలం బద్రుపాలెంలో పిండి ముసలయ్య అనే టీడీపీ కార్యకర్త ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అందజేశారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మృతుల కుటుంబాలకు అందజేయడం దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేదన్నారు.

March 21, 2026 / 08:00 PM IST

రేపల్లెలో రేపు విద్యుత్ అంతరాయం

BPT: రేపల్లెలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. 11కేవీ టౌన్ 5వ ఫీడర్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. దీంతో పీటేరు రోడ్డు, అంకమ్మ చెట్టు, పెద్ద మసీదు, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, అలీ నగర్, తాలూకా ఆఫీసులు, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కరెంట్ ఉండదని డిప్యూటీ ఈఈ శ్యామ్ సుధాకర్ బాబు చెప్పారు.

March 21, 2026 / 08:00 PM IST

లాడ్జీలు, హోటళ్లపై పోలీసుల తనిఖీలు

GNTR: మంగళగిరిలో లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు శనివారం అకస్మిక తనిఖీలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఎస్సై వెంకట్ ఈ తనిఖీలు చేపట్టారు. గదుల కేటాయింపు, ఐడీ కార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. లాడ్జీల్లో పేకాట, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామన్నారు.

March 21, 2026 / 08:00 PM IST

లాడ్జీలు, హోటళ్లలో పోలీసుల తనిఖీలు

GNTR: మంగళగిరిలో లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు శనివారం అకస్మిక తనిఖీలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఎస్సై వెంకట్ ఈ తనిఖీలు చేపట్టారు. గదుల కేటాయింపు, ఐడీ కార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. లాడ్జీల్లో పేకాట, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామన్నారు.

March 21, 2026 / 08:00 PM IST

TTD ఛైర్మన్‌ఫై శ్యామల సంచలన వ్యాఖ్యలు

TPT: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయని వైసీపీ నేత శ్యామల ఆరోపించారు. గోవుల మరణాలు, కొండపై మద్యం లభ్యత, తొక్కిసలాటలో భక్తుల మృతి వంటి ఘటనలపై ఆమె ధ్వజమెత్తారు. క్యూలైన్లలో భక్తులకు కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని విమర్శిస్తూ.. “మీ వీడియోలు బయటకొస్తే తప్పేంటి?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

March 21, 2026 / 08:00 PM IST

‘సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోండి’

KRNL: మద్దికేర సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్ అన్నారు. ఇవాళ వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని, అర్హులైన దివ్యాంగులు తమ పరిధిలో ఉన్న సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సదరం స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఈ నెల 30వ తేదీన ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేసుకోవచ్చని సూచించారు.

March 21, 2026 / 07:59 PM IST

భైరవస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు

VSP: భైరవస్వామి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం అధికారులను ఆదేశించారు. ఆలయానికి వెళ్లే రోడ్డును మెరుగుపరచడంతో పాటు, భక్తులకు తాగునీరు, టాయిలెట్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గ్రాండ్ ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం భైరవస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

March 21, 2026 / 07:59 PM IST

బీజేపీ పార్టీ బలోపేతం కార్యాచరణ సిద్ధాంతాలపై చర్చ

TPT: ఇవాళ రేణిగుంటలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి BJP పార్టీ ఇంఛార్జ్ కోలా ఆనంద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కార్యకర్తలతో కలిసి పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ చరిత్ర, సైద్ధాంతిక పునాది కాలాంశాలను శిక్షణార్థులకు వివరించారు.

March 21, 2026 / 07:53 PM IST

స్పీడ్ బ్రేకర్ తొలగింపు

KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లె సమీపంలోని శ్రీ మందగిరి శనీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన స్పీడ్ బ్రేకరును సిద్ధవటం ఏఎస్సై సుబ్బరామచంద్ర ఆధ్వర్యంలో ఇవాళ రాత్రి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్సై మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు స్పీడ్ బ్రేకరును శాశ్వతంగా తొలగింపు చేపట్టామని తెలిపారు.

March 21, 2026 / 07:52 PM IST