సత్యసాయి: రొద్దం మండలం కోగిర గ్రామానికి చెందిన ప్రశాంతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి సవిత తక్షణమే స్పందించారు. బాధితురాలి వైద్య ఖర్చుల నిమిత్తం ఆదివారం రూ. 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా కల్పించారు.