NLR: కావలిలో జనగణనపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో పాల్గొనాలని కోరారు. కచ్చితమైన సమాచారం ఇస్తే ప్రభుత్వ పథకాలు అందజేయడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.