పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. జట్టును విజయపథంలో నడిపించగల సామర్థ్యం శ్రేయస్కు ఉందని తెలిపాడు. అందుకే వేలంలో అతని కోసం అంతగా పట్టుబట్టానని పేర్కొన్నాడు. ఒక జట్టును సున్నా నుంచి నిర్మించాలంటే శ్రేయస్ వంటి ప్రతిభావంతుడైన కెప్టెన్ అవసరమని చెప్పాడు. కాగా, వేలంలో PBKS అయ్యర్ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.