కృష్ణా: విశ్వనాథపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఊరటగా ఆదివారం మినుములు, పెసల కొనుగోలు కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రభుత్వ కనీస మద్దతు ధరల ప్రకారం నాణ్యత ఆధారంగా పంటలను స్వీకరిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. మినుములకు సుమారు రూ. 7,800, పెసలకు రూ. 8,700 పైగా ధరలు లభిస్తున్నాయని చెప్పారు.
GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం కానుకల హుండీల లెక్కింపు పూర్తైంది. హుండీల ద్వారా రూ.48,76,103, అన్నదాన హుండీ ద్వారా రూ.2,81,368 ఆదాయం వచ్చినట్లు ఉపకమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
PLD: వినుకొండ నియోజకవర్గం రాముడిపాలెంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటించారు. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పొలాలను ఆయన పరిశీలించారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
KDP: టీం ఇండియా మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి ఇవాళ కుటుంబ సమేతంగా కడపలోని శ్రీ విజయ దుర్గాదేవిని దర్శించుకున్నారు. పదేళ్లుగా ఆమె తల్లి ఈ ఆలయంలో రాహుకేతు పూజలు చేస్తుండగా, శ్రీచరణి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు.
SKLM: మందస మండలం డిమిరియా గ్రామ సమీపాన గెడ్డలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు అంబుగాంకు చెందిన గుడియా జగన్నాథ్(47)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
GNTR: ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న డీఎస్ఆర్ కృష్ణకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE)గా పదోన్నతి కల్పించారు. వైస్ చాన్సలర్ కే. గంగాధర రావు ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ సింహాచలం, ఓఎస్డీ రవికుమార్, ఇంజనీర్ రాజకుమార్ పాల్గొన్నారు.
BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రేపు యద్దనపూడి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు యద్దనపూడి గ్రామంలో మాజీ మంత్రి స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయం వర్గాలు తెలిపాయి.
PLD: ఆస్తి, అధికారంపై వ్యామోహం, తల్లీచెల్లెళ్లపై విద్వేషమే జగన్ నైజమని ఎమ్మెల్యే పుల్లారావు విమర్శించారు. బాబాయ్ హత్యతో లబ్ధి పొంది, ఆయన బిడ్డను వేధించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకోవడం తగదన్నారు. దేవుడితో ఆటలాడితే వైసీపీ నేతలకు తగిన శాస్తి తప్పదన్నారు.
E.G: తాళ్లపూడిలోని కరిబండి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. APSSDC సహకారంతో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తారని అన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
NDL: బేతంచెర్ల మండలం రంగాపురంలో సుంకుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్రస్థాయి పాల పండ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. కోడుమూరు వృషభాలు ప్రథమ, ప్రకాశం జిల్లా ద్వితీయ, సీసంగుంటల తృతీయ, మంత్రాలయం-బేతంచెర్ల నాల్గవ, మాధవరం ఐదవ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు రూ.40 వేల నుంచి రూ.10 వేల వరకు బహుమతులు అందజేశారు.
SKLM: పోలాకి మండల కేంద్రంలో నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అర్చన శనివారం రాత్రి పర్యటించారు. ఈ మేరకు అనకాపల్లిలో మార్చి 23న జరగనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.
NLR: సంగం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం సీఐ శ్రీనివాస రెడ్డి, ఎస్సై రాజేష్ వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, ఫైన్లు విధించారు. వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి గ్రామానికి వెళ్లి హనుమంతరాయ చౌదరి భౌతిక దేహానికి టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
W.G: తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మవారికి వేలాది మంది మహిళలతో మంగళ హారతులు ఇచ్చి ఇవాళ రాత్రి గ్రామ సేవ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వెయ్యి మంది కళాకారులతో ఈ ఆఖరి రోజు ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖులు, రాజకీయ నేతలు అమ్మవారి రధాని లాగుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ELR: ఈనెల 23న జరుగుతున్న చలో విజయవాడ ప్రదర్శన, మహా ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఐఎన్టీయూ ఏలూరు నగర అధ్యక్షులు బి.సోమయ్య పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లాలో చలో విజయవాడ కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే లాగా ఉన్నాయన్నారు.