ELR: ఆదివారం పెదవేగి మండలం విజయరాయి గాంధీ నగర్ లోని సీతారామ కళ్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఆదివారం జరిగింది. వారం రోజుల్లోగా కోకో గింజల ధరల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.