KDP: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన నివాసంలో బద్వేల్కు చెందిన డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి శాలువా, పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు ఆయన తెలిపారు.
కర్నూలు: ఎనిమిదో వేతన సంఘంనేపథ్యంలో జీతాల పెరుగుదల పై చర్చలు జరుగుతున్న వేళ, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని 8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్ పేరుతో వాట్సాప్ సందేశాలు పంపుతూ మోసగాళ్లు అమాయక ప్రజలను వలలో వేస్తున్నారన్నారు.
W.G: పిల్లలలో సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడానికి మార్చి 1న నరసాపురం బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి పూరిళ్ళ శ్రీనివాస్ తెలిపారు. మార్చి 1న వైఎన్ కాలేజీలో పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, స్పాట్ డ్రాయింగ్, వ్యాసరచన, తెలుగు కథారచన, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, జానపద నృత్యం, క్లాసికల్ డ్యాన్స్ నిర్వహిస్తామన్నారు
ATP: జిల్లాలో రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ పి. జగదీష్ ఆదివారం తెలిపారు. 64 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాలను సైలెంట్ జోన్లుగా ప్రకటించామన్నారు. పరీక్ష పత్రాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: బొబ్బిలి కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న మర్రి మాధవిదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మాధవి చైతన్య పాఠశాలలో గణితం టీచర్గా పని చేస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా ఆమెను భర్త నరేష్ అనుమానంతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. నీవు చనిపోతేనే దరిద్రం పోతుందని పదే పదే అనడంతో మనస్తాపానికి గురైన మాధవి శనివారం రాత్రి ఉరివేసుకుందని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు.
AKP: మాడుగుల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెస్ క్లబ్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. జర్నలిస్టులు వాస్తవాలను వెలికి తీసే విధంగా పని చేయాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో మారెమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు సతీమణి ఎం.ఎస్. ఉమాదేవి పాల్గొన్నారు. గ్రామ మహిళలు ఆమెకు ఘనస్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
W.G: పాలకొల్లులోని ప్రధాన కాలువలోకి దశాబ్దాలుగా చెత్తాచెదారం చేరుతోందని, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దిగువ గ్రామాల సర్పంచులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ వదిలేసిన మురుగు పంట కాలువల్లో కలిసి తమ గ్రామాలకు వస్తోందని, తాము విషం తాగుతున్నామంటూ గత మండల సర్వసభ్య సమావేశాల్లోనూ ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నమయ్య: రాయచోటి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధికార యాప్ MYTDP పోస్టర్ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు మౌర్యా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మౌర్యా రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలందరూ MYTDP యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాలని పిలుపునిచ్చారు.పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ అన్నంరాజునగర్లోని శ్రీ అష్టలక్ష్మీ దేవాలయాన్ని ఆదివారం రష్యా దేశస్తులు సందర్శించారు. భారతదేశంలోని ప్రముఖ ఆలయాలపై అధ్యయనం చేస్తున్న భాగంగా ఈ దేవాలయాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆలయంలో శివకేశవుల విగ్రహాల నిర్మాణం అద్భుతంగా ఉందని, ముఖ్యంగా వీణ ధరించిన అమ్మవారి రూపం తమను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ‘PGRS’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు రషిదుల్లా బృందం మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా ఎన్నికైన సందర్భంగా రషీదుల్లా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సబ్ కోర్టు భవన నిర్మాణానికి నిధుల అనుమతి,గోనెగండ్లను ఎమ్మిగనూరు కోర్టు పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె స్వయంగా అర్జీలు స్వీకరించారు. సాగునీరు, మౌలిక వసతులు, ఇతర వ్యక్తిగత సమస్యలపై విన్నపాలు అందాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.
కోనసీమ: క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్య భారత్ సాకారమవుతుందని, కరాటే నేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు, ఆత్మ రక్షణ కూడా సాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం RCM చర్చ్లో ఆదివారం జరిగిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ -2026 పోటీలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు.
కృష్ణా: పామర్రు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కీలక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం హాస్పిటల్ సహకారంతో రేపు నిమ్మకూరు గ్రామంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించనున్నారు. నియోజకవర్గ మహిళలు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.