కృష్ణా: నాగాయలంక మత్స్యకారు కుటుంబానికి చెందిన నాగిడి గాయత్రి విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఆమె ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కోచ్లు సర్టిఫికెట్తో పాటు అవార్డును శనివారం అందజేశారు.
శ్రీకాకుళం నగరంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. రూ.2 కోట్లతో నిర్మించిన కార్గిల్ పార్కును ప్రారంభించారు. ఈ పార్కులో బాబాయ్ అబ్బాయ్ కాసేపు బ్యాట్ పట్టి బాక్స్ క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, తదితరులు పాల్గొన్నారు.
PLD: క్రోసూరు మోడల్ స్కూల్లో 2026-27 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మేరీ సుసాన్ శనివారం వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు MPC, Bi.PC, MEC,CEC గ్రూపులలో విద్యను ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. మార్చి 18 తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ATP: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలు శనివారం ముగిశాయి. సాయంత్రం నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పల్లకీపై ఊరేగిస్తూ అనుబంధ దేవాలయమైన కాశీవిశ్వేశ్వరాబయం వరకు తీసుకెళ్లారు. భక్తులు ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
NLR: సంగం వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి సీఐ శ్రీనివాస రెడ్డి, S1 రాజేశ్ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. అలాగే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా బైకులు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
సత్యసాయి: పుట్టపర్తిలో బెస్త కళ్యాణ మండప నిర్మాణానికి ప్రముఖుడు బెస్త బయన్న రూ. 5,10,012 విరాళం అందజేశారు. ఈ నిధులు నిర్మాణ పనులకు కీలకంగా మారుతాయని కమిటీ సభ్యులు జ్యోతి కేశవ, జై సాయి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, కులస్తులు, దాతలు సహకరించాలని కోరారు. సామాజిక బాధ్యతతో స్పందించిన బయన్నను స్థానికులు అభినందిస్తున్నారు.
కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 271 మందిపై కేసులు నమోదు చేసి, రూ.57,450 జరిమానా విధించారు. కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ELR: వేలేరుపాడు మండలంలో తడిసిన మిర్చి మొక్కజొన్న, వేరుశనగ, పుల్ల శనగ, కంది తదితర పంటలను సీపీఐ మండల బృందం శనివారం పరిశీలించింది. అకాల వర్షం కారణంగా తడిసిన పంటలను ప్రభుత్వం మద్దతు దరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.50 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతులని ఆదుకోవాలని మండల కార్యదర్శి బాడిశ రాము కోరారు.
WG: కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా తణుకు పట్టణానికి చెందిన గురుజుకోట రాకేష్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర నాయకులు శనివారం తణుకు విచ్చేసి నియామక పత్రాలు అందజేశారు. కుమ్మర శాలివాహన సంక్షేమం అభివృద్ధి కోసం కృషిచేసి, సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. త్వరలోనే పూర్తిస్థాయి జిల్లా కమిటీని నియమిస్తానని రాకేష్ బాబు తెలిపారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో పలుకూరు గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి అన్నారు.
NDL: శ్రీశైలం ఆలయంలోని స్వామివారి మూల విరాట్ వీడియో వైరల్ ఘటనను దేవస్థానం అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సుబ్బారెడ్డి తెలిపారు.
SKLM: సోంపేట ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. చిన్నాజీవర్మ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
TPT: గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం పురావస్తు శాఖ డైరెక్టర్ అజ్మీర్ బీమా పర్యటించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, రానున్న కుంభాభిషేకం నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బత్తలగిరి నాయుడు, ఈవో రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు.
PKSM: కొండపిలో కేజీ చికెన్ 280 అమ్ముతున్నారు. స్కిన్ లెస్ చికెన్ 310 వరకు అమ్ముతున్నారు. కాగా కేజీ చికెన్కు కాంటాలో మాయాజాలం చూపిస్తూ 900 గ్రాములు మాత్రం ఇస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. నేడు ఆదివారం కావడంతో చికెన్ కోసం షాపులు దగ్గర అధిక సంఖ్యలో చికెన్ కొనుగోలు దారులు ఉన్నారు.
PPM: మన్యం లీగ్స్-2026 జిల్లా స్థాయి క్రికెట్లో విజేతగా కురుపాం జట్టు నిలిచింది. ఈ మేరకు శనివారం నిర్వాహకులు DSTO శ్రీధర్ చేతులమీదుగా విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5వేలు నగదు బహుమతి అందించారు. రన్నరప్గా వీరఘట్టం జుట్టుకు రూ.3వేలు, తృతీయ స్థానం సాధించిన కొండవాడ జట్టుకు రూ.2వేలు బహుమతి అందజేసారు. అనంతరం డీఎస్టీవో శ్రీధర్ విజేతలను అభినందించారు.