సత్యసాయి: పుట్టపర్తి రూరల్ పరిధిలోని గంగిరెడ్డిపల్లిలో పేకాటాడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సురేష్ పర్యవేక్షణలో ఏఎస్ఐ ప్రసాద్ ఈ దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి రూ.44,250 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన సురేష్ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.