PLD: అడవులను కాపాడుకుంటేనే శ్రీరామ రక్ష అని అటవీ రేంజ్ అధికారులు, సిబ్బందితో జరిగిన సమీక్షా సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటూ, పచ్చదనాన్ని పరిరక్షించాలని సూచించారు. నియోజకవర్గంలో మొక్కలు సంరక్షణ ఎలా అనే విషయంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
PLD: నూజండ్ల మండలంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. మండలంలోని బుర్రిపాలేం వద్ద ఆర్టీసీ బస్సు తగిలి ఇద్దరు విద్యార్థులు గాయపడి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ వచ్చి విద్యార్థులను పరామర్శించారు.
E.G: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. స్థానిక ఎఫ్సీఐ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం కేంద్రాన్ని ఆర్డీవో ఆర్ కృష్ణనాయక్తో కలిసి కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి ఈవీఎం భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు.
PLD: బోల్లాపల్లి మండలం అయ్యన్నపాలెం గ్రామంలో గురువారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పశు వైద్య అధికారి శివుడు నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పశు వైద్య అధికారి డాక్టర్ సాల్మన్ సింగ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామంలోని పశువుల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సత్యసాయి: పెనుకొండలో అంగన్వాడీ వర్కర్స్ అర్బన్ సెక్టార్ బుధవారం సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్, బాబావాలి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కు వడ్డీతో సహా గ్రాట్యూటి చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఐసీడీఎస్కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
GNTR: స్థానిక పారిశుధ్య సమస్యల పరిష్కార చర్యల్లో భాగంగా మంగళగిరి పరిధిలో మిద్దె సెంటర్, మార్కెట్, గాజుల వారి బజార్ రోడ్డులో బుధవారం తెల్లవారు జామున నగరపాలక సంస్థ కమిషనర్ అలీం భాషా ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రోడ్లు, మురుగు కాలువల పారుదల వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం మార్కండేయ కాలనీ గోశాలను తనిఖీ చేశారు.
CTR: పుంగనూరు RTC డిపో సమీపంలో APPTD ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు జగన్నాథ్ యాదవ్, కార్యదర్శి బలరాం, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాధాకృష్ణ హాజరయ్యారు. పుంగునూరు డిపోలో ఉన్న సమస్యలపై చర్చించారు. డిపోలో పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
NLR: బుచ్చి పట్టణంలోని స్థానిక పార్క్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కౌన్సిలర్లు మార్కెట్ను సందర్శించారు. మహిళలు స్వయంగా చేసిన వస్తువులను ఆహార పదార్థాలను వారు సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి చేసుకునేలా మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
NLR: ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట దర్బల్ మిట్ట కండ్రికలో బుధవారం ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. చిన్నపిల్లలకు, వృద్ధులకు శీతాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ కుమార్, ఏఎన్ఎం ధనలక్ష్మి, సీహెచ్వో నందిని పాల్గొన్నారు.
NLR: మనుబోలు ప్రభుత్వ బాలికల హైస్కూల్కు చెందిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. పదో తరగతి విద్యార్థులు డాన్స్, ఇంటర్మీడియట్ విద్యార్థిని పూర్ణిమశ్రీ కూచిపూడి నృత్యంతో అందరిని ఆకట్టుకుంది. దీంతో వారి ప్రతిభను గుర్తించి సోమిరెడ్డి సన్మానించారు.
CTR: రొంపిచర్ల మండలానికి వచ్చిన పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రజలు తమ సమస్యలు తెలియజేశారు. నడింపల్లిలో ఉచిత మినరల్ వాటర్ సరఫరా పథకానికి కాయిన్ బాక్స్ అమర్చారని గ్రామస్థులు కోరారు. పోలీసులు తప్పుడు సారా కేసు పెట్టారని తెలిపారు. బండ వేలం పెట్టాలని అధికారులు ఆదేశించారని వడ్డెరలు ఆవేదన వ్యక్తం చేశారు.
NLR: ఉదయగిరి పట్టణంలోని నాలుగు కాళ్ల మండపం వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉదయగిరి డిపో నుంచి పంచాయతీ బస్టాండ్కు వస్తున్న బస్సు తగిలి ఓ వృద్ధుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వృద్ధుడిని ఉదయగిరి ఆసుపత్రి తరలించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత కొద్ది నెలలుగా ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ మెయిన్ రోడ్డుపై ట్రఫిక్ తీవ్రంగా ఉందన్నారు.
ATP: ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రేపు ఉరవకొండ మండలానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు డ్రిప్ & స్ప్రింక్లర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం రాగులుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి హంద్రీనీవా కాలువ వెడల్పు పనుల పరిశీలన కార్యక్రమంలో పయ్యావుల కేశవ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు.
ATP: ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రేపు ఉరవకొండ మండలానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు డ్రిప్ & స్ప్రింక్లర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం రాగులుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి హంద్రీనీవా కాలువ వెడల్పు పనుల పరిశీలన కార్యక్రమంలో పయ్యావుల కేశవ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు.
ATP: నార్పల మేజర్ పంచాయతీ ప్రజలు ఇంటి, కొళాయి పన్నులు చెల్లించాలని నార్పల పంచాయతీ సెక్రటరీ శ్యామల తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మేజర్ పంచాయతీలోని పలు దుకాణాల వ్యాపారులు తప్పనిసరిగా తమ తమ దుకాణాలకు లైసెన్సులు రెన్యువల్ చేసుకొని పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.