BPT: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్ కారంచేడు ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించనున్నారు. చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు. రైతులు, భూసంబంధిత సమస్యలున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
VZM: సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామంలో సర్పంచి కోల్ల రేవతి ఆధ్వర్యంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలోని మరుగు కాలువ పూడుకతీత పనులు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి కూనబిల్లి కోటేశ్వరరావు తెలిపారు. మురుగు కాలవలోని పూడిక గ్రామ శివారు ప్రాంతానికి తరలించడం జరిగిందన్నారు.
E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం రాత్రి తెలంగాణ డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె డాక్టర్ సనాతని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి వేడుకకు రావాలని కోరారు. గౌరు చరితరెడ్డి, వెంకటరెడ్డిల కుమారుడు జనార్ధన్ రెడ్డితో సనాతని వివాహం ఏప్రిల్ 2న హైదరాబాద్లో జరగనుందని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు.
KKD: పిఠాపురం మార్కెట్లో ఆదివారం చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ చికెన్ కిలో రూ.280 ఉండగా, స్కిన్లెస్ రూ. 350, బోన్ లెస్ రూ. 420 వరకు విక్రయిస్తున్నారు. నాటుకోడి ధర రూ. 600కు చేరింది. గత వారంతో పోలిస్తే ధరలు భారీగా పెరగడంతో మాంసం ప్రియులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారిగా రేట్లు పెరగడంతో సామాన్యులు చికెన్ కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
KRNL: బనవాసి బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రాజిత ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 60, బైపీసీలో 40, ఎంఈసీలో 30 సీట్లు ఉన్నాయని తెలిపారు.
BPT: సంతమాగులూరు శాఖ గ్రంథాలయంలో ఇవాళ విద్యార్థులకు చదువుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లైబ్రేరియన్ విజయభాస్కర్రెడ్డి గ్రంథాలయాల ఉపయోగాన్ని వివరించి, నిత్యం చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
NLR: వింజమూరు మండలం ఏ కిస్తీపురం పంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ప్రారంభించారు. రూ. 32లక్షలతో భవన నిర్మాణం పూర్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలనాపరంగా వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. పంచాయతీ భవనం ఏర్పాటుకు 5 సెంట్ల భూమిని ఉచితంగా అందించిన లక్కు వెంకటేశ్వరరెడ్డిని ఆయన సత్కరించారు.
KRNL: దేవనకొండ మండలం కుంకునూరు రెవెన్యూ చుట్టుపక్కల రేపు 9 గంటలకు రీ సర్వే చేయనట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది. రైతులు వారి పొలంలో ఉండి భూముల హద్దులు చూపించుకోవాలని అధికారులు పేర్కొన్నారు. పొలం పాస్ బుక్, ఆధార్ కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, బ్యాంకు ఖాతా తీసుకుని రావాలని తెలిపారు.
KRNL: మార్చి 28, 29వ తేదీలలో ఆలూరులో జరుగనున్న 21వ ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ దేవనకొండ మండల కార్యదర్శి నరసరావు పేర్కొన్నారు. కార్మికులందరూ సంఘటితంగా పోరాడి తమ హక్కులు సాధించుకునేందుకు గాను తలపెట్టిన ఈ మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యలపై చర్చలు జరిపి దిశానిర్దేశం చేస్తారన్నారు.
పార్వతీపురం జిల్లాలో డిమాండుకి సరిపడా LPG గ్యాస్ సరఫరా జరుగుతోందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. వదంతులు నమ్మి అనవసరంగా నిల్వలు చేయొద్దని, దానివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందన్నారు.
TPT: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 30న నాయుడుపేట పర్యటనకు రానున్నారు. బిరదవాడ సమీపంలోని టిడ్కో గృహ సముదాయాలను ప్రారంభించి, లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయనున్నారు. పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, జేసీ గోవిందరావుతో కలిసి అధికారులు పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
సత్యసాయి: ఉదయగిరిలోని MPDO నూతన భవనం సోమవారం ఉదయం 10 గంటలకు పునః ప్రారంభిస్తున్నట్లు MPP మూలే పద్మజ వినయ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చెప్పారు. జడ్పీ, మండల నిధులతో పాటు MPP సొంత నిధులతో ఈ భవన నిర్మాణం నూతన హంగులతో ఏర్పాటు చేశారు.
E.G: రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చియ చౌదరి మద్దుకూరి సుధీర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆకస్మికంగా మృతి చెందిన సుధీర్ చిత్రపటానికి నివాళు అర్పించారు. ఎమ్మెల్యే స్థానిక సొసైటీ బీమా నుంచి మంజూరైన రూ.25 వేల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APTDC వాసిరెడ్డి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
KKD: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 12 వరకు ప్రక్రియ సాగనుంది. ఇందుకు సంబంధించి కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేర్వేరు జిల్లాలకు చెందిన జవాబు పత్రాలను కాకినాడుకు చేర్చారు.