• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి

ELR: జిల్లాలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియేట్ థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాల్లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు ఉదయం 9 గం నుంచి మధ్యాహ్నం 12 గం వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

January 29, 2025 / 05:20 PM IST

గిరిజనులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలి

ASR: 1/70 చట్టాన్ని సవరించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి డిమాండ్ చేశారు. బుధవారం అరకులోయలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజనుల మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు తక్షణమే గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

January 29, 2025 / 05:20 PM IST

పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన వైద్యులు

ASR: కొయ్యూరు మండలం ఎం.మాకవరం, పనసలపాడు గ్రామాల్లో మండల పశువుల డాక్టర్ కే.రాజేష్ కుమార్, కొండగోకిరి, కినపర్తి గ్రామాల్లో డౌనూరు డాక్టర్ ఆర్జే దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఆయా శిబిరాల్లో 76 అనారోగ్యానికి గురైన పశువులకు వైద్యం అందించామని డాక్టర్లు తెలిపారు. 130 పెద్ద పశువులకు నట్టల నివారణ మందులు అందించామన్నారు.

January 29, 2025 / 05:16 PM IST

‘క్రీడాకారులను అభినందించిన ఎస్పీ’

SKLM: ఇటీవల మహారాష్ట్రలో జరిగిన 69వ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ జట్టులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నందిని, గాయత్రి, జ్యోత్స్న ఉన్నారు. బుధవారం ముగ్గురు క్రీడాకారులు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వీరిని ఎస్పీ అభినందించారు.

January 29, 2025 / 05:16 PM IST

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి

VZM: జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి కనకలక్ష్మి అన్నారు. బుధవారం గజపతినగరం కోర్టు ఆలయంలో లోక్ అదాలత్ పై న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. మార్చి 8వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం జరిగాలా కృషి చేయాలన్నారు. ఈ మేరకు కక్షి దారుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు.

January 29, 2025 / 05:00 PM IST

గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

కోనసీమ: పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. ఆయన పి.గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద గృహ నిర్మాణశాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజల గృహాల నిర్మాణం పురోగతిపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

January 29, 2025 / 05:00 PM IST

అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

కోనసీమ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని అర్హత కలిగిన  లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద పీఎం సూర్యఘర్ పథకం అమలు తీరు పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తక్షణమే లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

January 29, 2025 / 04:54 PM IST

జనసేన కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన పంతం నానాజీ

GNTR: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో బుధవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి చెందినవారు తమ సమస్యలను తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఫోన్ ద్వారా తెలిపారు. పార్టీ నాయకులు తలాటం సత్య, తిరుపతి అనూష, లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

January 29, 2025 / 04:53 PM IST

పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి

ప్రకాశం: మార్కాపురం డివిజన్‌లోని ప్రతి స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు పరిష్కారం పై దృష్టి పెట్టాలని డీఎస్పీ నాగరాజు చెప్పారు. మార్కాపురం SDPO కార్యాలయంలో సబ్-డివిజన్‌లోని నేరాల నెలవారీ సమావేశం బుధవారం జరిగింది. స్టేషన్ వారీ పెండింగ్ కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

January 29, 2025 / 04:52 PM IST

పాలకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతి

KKD: పాల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, విశాఖ డైయిరీని అభివృద్ధి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రాల అప్పారావు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి జిల్లా పాల రైతుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.

January 29, 2025 / 04:51 PM IST

దివ్యాంగులు పింఛన్లు తనిఖీ

సత్యసాయి: తాడిమర్రి మండలం చిల్లవారి పల్లి గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ దివ్యాంగులు పింఛన్లు తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వం నియమించిన డాక్టర్ నరసింహ రెడ్డి, డాక్టర్ చైతన్య గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. తనిఖీ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తున్నామని తెలిపారు.

January 29, 2025 / 04:50 PM IST

ఆయుర్వేద ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి

సత్యసాయి: సమత ఆయుర్వేద ఆస్పత్రిని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించాను. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలు పరిశీలించారు. ఆసుపత్రులో చికిత్స విధానాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ప్రతి వైద్యం ముఖ్యమైనదే అని తెలిపారు.

January 29, 2025 / 04:50 PM IST

30నుంచి విశాఖ‌లో ఒసాప్ కాన్-2025 సదస్సు

VSP: నవ్యాంధ్ర ఆర్దో పెడిక్ సర్జన్ల అసోసియేషన్, ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్ జార్జ్ ఆసుపత్రి ఆర్థో విభాగం సంయుక్తంగా ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ విశాఖలోని రాష్ట్రస్థాయి సదస్సు(ఒసాప్ కాన్) 2025 నిర్వహిస్తున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ ఛైర్మన్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్. పి.శివానంద తెలిపారు.

January 29, 2025 / 04:48 PM IST

రేషన్ డీలర్లుతో తహశీల్దార్ సమీక్షా సమావేశం

PLD: వినుకొండ తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం రేషన్ డీలర్లతో తహశీల్దార్ సురేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెల రేషన్ సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ సరుకులు ఇవ్వడం లేదని ప్రజల నుంచి ఏమైన ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

January 29, 2025 / 04:40 PM IST

‘విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా’

SKLM: పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులకు రూ.20 వేలు బహుమానం అందజేశారు. అనంతరం కళాశాల సిబ్బంది ఎమ్మెల్యేని సన్మానించారు.

January 29, 2025 / 04:34 PM IST