PLD: చిలకలూరిపేట మండలం రాజాపేటలో ఆదివారం జరిగిన మహా కూటములకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. దేవుని వాక్యంతో ప్రజల కష్టాలు తొలగి, రక్షణ లభిస్తుందని ఆయన అన్నారు. తమ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను, వర్గాలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం పేదల ఆరోగ్యం, సంతోషం కోసం ప్రార్థనలు నిర్వహించారు.