ASR: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో పిల్లలు చనిపోవడాలు నివారించేందుకు కలెక్టర్ నిశాంతి సోమవారం కఠిన ఆదేశాలు జారీచేశారు. ప్రమాదకర కాలువలు, చెరువులు, జలపాతాలను గుర్తించి, రిస్క్ మ్యాపింగ్ చేసి శుక్రవారంలోగా ఐటీడీఏకు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. లోతైన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు, వెదురు కంచెలు, తాళ్లతో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.