E.G: నిడదవోలు బాలికల ఉన్నత పాఠశాలలో నెస్లే సంస్థ CSR నిధులతో నిర్మించిన శానిటేషన్ బ్లాక్ను మంత్రి కందుల ప్రారంభించారు. విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతకు మౌలిక వసతులు కీలకమని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతూ.. నెస్లే సంస్థ సామాజిక బాధ్యతను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.