AKP: రాజకోడూరుకు చెందిన వ్యక్తి వద్ద రూ.20 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశ్నగర్కు చెందిన కర్రి వెంకటరమణ వద్ద బైలపూడి సన్యాసిరావు, వెంకటరమణ, గణేష్ డబ్బు తీసుకుని వడ్డీతో చెల్లిస్తామని చెప్పి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.