ఎన్టీఆర్: విశాఖపట్నం-లోకమాన్య(నం.18519/20) తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్ప్రెస్ రైళ్లను నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లు విజయవాడ-గుంటూరు-పగిడిపల్లి మార్గంలో ప్రయాణిస్తాయి. ఈ సమయంలో ఖాజీపేట జంక్షన్లో స్టాప్ను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.