ప్రకాశం: సింగరాయకొండలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. లలితమ్మకు చెందిన ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి నగదు, బంగారాన్ని దోచుకు వెళ్లారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లిన బాధితురాలు ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.