NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ అన్ని బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకులకు వచ్చిన వాహనదారులు వెనుదిరిపోతున్నారు. దీంతో ఆటో వాలాలు, వ్యవసాయంపై ఆధారపడిన టాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి డీజల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.