• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డంపింగ్ యార్డ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: పట్టాభి

NTR: డంపింగ్ యార్డ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేస్తామని స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు. విజయవాడ గుణదలలో జరిగిన BIS సమావేశంలో పాల్గొని మాట్లాడారు. డోర్ టూ డోర్ వేస్ట్ కలెక్షన్ చేయడానికి అన్నిరకాల ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌ను స్వచ్ఛంద కార్పొరేషన్లో ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

January 30, 2025 / 07:16 PM IST

‘హైవే బస్టాండ్‌ను ఉపయోగంలోకి తేవాలి’

కృష్ణా: జగ్గయ్యపేట ఆటోనగర్ సమీపంలో నిర్మించిన హైవే బస్టాండ్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ ఆర్ఎం దానంకి వైసీపీ జగ్గయ్య పేట ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు ఇక్కడ ఆగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్ఎంను కోరారు. ఆర్ఎం సానుకూలంగా స్పందించారని తన్నీరు చెప్పారు.

January 30, 2025 / 07:11 PM IST

తిరుపతి జిల్లాలో పెన్షన్లకు రూ.112.19 కోట్లు

TPT :తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన 2,63,191 మంది పెన్షన్ దారులకు రూ.112.19 కోట్లు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం 100 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి పెన్షన్ దారునికి తెలియజేయాలన్నారు.

January 30, 2025 / 06:48 PM IST

కాఫీ రైతులకు రూ.50 లక్షలు బోనస్

ASR: చింతపల్లి ఎకోపల్పింగ్ యూనిట్‌కి కాఫీ పళ్లు సరఫరా చేసిన రైతులకు రూ.50లక్షల బోనస్ చెల్లిస్తున్నామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ గురువారం తెలిపారు. ముందుగా రైతులకు కిలోకు రూ.44 చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పుడు కేజీకి అదనంగా మరో రూ.8 బోనస్‌గా చెల్లిస్తున్నామన్నారు. గత ఏడాది చెల్లించిన బోనస్ కంటే రెట్టింపు బోనస్‌ను రైతులకు అందిస్తున్నామన్నారు.

January 30, 2025 / 05:15 PM IST

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: సీఐ

TPT: వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని గూడూరు ఒకటో పట్టణ సీఐ శేఖర్ బాబు హెచ్చరించారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క వాహన చోధకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు.

January 30, 2025 / 05:13 PM IST

పెద్దలంబలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

SKLM: సారవకోట మండలం పెద్దలంబ గ్రామాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాల మురళీకృష్ణ గురువారం సందర్శించారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం పథకం కింద నిర్వహించిన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెయిన్ కిల్లర్స్, ఇంజక్షన్ టాబ్లెట్‌లను ఎక్కువ మోతాదుగా వాడినందున కిడ్నీపై ప్రభావం పడుతుందని ఆయన ప్రజలకు సూచించారు.

January 30, 2025 / 05:08 PM IST

మర్రిపాడులో సదరం సర్టిఫికెట్ల సర్వే పూర్తి

NLR: మర్రిపాడు మండలంలో సదరం సర్టిఫికెట్ల సర్వే పూర్తయినట్టు మండల వైద్యాధికారి గోపీనాథ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మర్రిపాడు మండలంలోని 24 పంచాయతీలలో మంచానికి పరిమితమై నెలకు రూ.15వేలు తీసుకుంటున్న వారు 51 మంది ఉన్నారని, ఈ సర్వే ప్రక్రియ ఇద్దరు ప్రొఫెసర్స్ చేత ఆయా సచివాలయ ఏఎన్ఎం హెల్ప్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో పూర్తి అయినట్టు ఆయన తెలిపారు.

January 30, 2025 / 05:06 PM IST

‘పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

CTR: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ అడిషనల్ డైరెక్టర్ మూర్తి తెలిపారు. గురువారం చిత్తూరు డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏడీ మాట్లాడుతూ.. చేతి వృత్తుల వారికి జీవనోపాదులు కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు.

January 30, 2025 / 05:02 PM IST

సెక్యూరిటీని విధులు నుంచి తొలగించిన ఆలయ ఈవో

TPT: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈనెల 28వ తేదీ భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన మహిళా సెక్యూరిటీ ఏఆర్ మణిని విధుల నుంచి తొలగించినట్లు ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. గురువారం ఆ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. భక్తుల ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ సిబ్బందిపై విచారణ చేపట్టి సీసీ కెమెరాలు ద్వారా పరిశీలించి నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లు తెలియడంతో తొలగించామన్నారు.

January 30, 2025 / 04:51 PM IST

జాతీయస్థాయి ఉర్దూ కవి సమ్మేళనాలకు మదనపల్లె కవులు

అన్నమయ్య: ఫిబ్రవరి 1న తమిళనాడులోని తిరుపత్తూరు, అలాగే ఫిబ్రవరి 2న తిరుపతిలో జరిగే అఖిలభారత ఉర్దూ కవి సమ్మేళనాలకు మదనపల్లె ఉర్దూ కవులు బాబా ఫక్రుద్దీన్ అలియాస్ ఖమర్ అమీని, పఠాన్ మహమ్మద్ ఖాన్‌లకు ఆహ్వానం అందింది. గురువారం వారు మాట్లాడుతూ.. ఉర్దూ భాషలో నిర్వహించే ఈ కవి సమ్మేళనాలు మతసామరస్యం, జాతీయ సమైక్యతకు దోహదపడుతాయన్నారు.

January 30, 2025 / 04:26 PM IST

కుష్ఠు వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ

CTR: గ్రామాల్లో కుష్ఠు వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు డాక్టర్ పవన్ తెలిపారు. కుష్ఠు వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం చౌడేపల్లి మండలం దాదేపల్లిలో పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వ్యాధిని ఆరంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని తెలిపారు.

January 30, 2025 / 04:23 PM IST

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడుగా పెద్దులపల్లి ప్రభాకర్ ఎన్నిక

KDP: అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులుగా బ్రహ్మం గారి మఠం మండలానికి చెందిన పెద్దుల్లపల్లి ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ బ్రహ్మంగారిమఠం మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లేష్, లోకేష్‌లు మండల సమితి పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించే దిశగా పోరాటం చేయాలని విన్నవించారు.

January 30, 2025 / 03:34 PM IST

ప్రతి నెల కౌన్సిల్ సమావేశం నిర్వహించండి: కౌన్సిలర్లు

ATP: కదిరి పట్టణంలోని మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశాన్ని ఛైర్పర్సన్ నజీమున్నీసా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా కౌన్సిల్ సమావేశం ఎందుకు నిర్వహించలేదని అధికారులను ప్రశ్నించారు. ప్రతి నెల సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని తెలిపారు. బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని అధికారులను కోరారు.

January 30, 2025 / 03:09 PM IST

బాలికతో వ్యభిచారం.. వెలుగులోకి కీలక విషయాలు

KKD: ప్రేమ పేరుతో బాలికను మోసగించి వ్యభిచారంలోకి దింపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘యువకుడు తల్లితో కలిసి బాలికను చిత్రహింసలకు గురిచేసి వ్యభిచారంలోకి దింపారు. ఆమెకు ఇన్ఫెక్షన్ రావడంతో రకరకాల మందులు వేశారు. బాధలు భరించలేని బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది’. అని తెలిపారు.

January 30, 2025 / 07:54 AM IST

జగన్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు: కేతిరెడ్డి

ATP: వైసీపీ ప్రభుత్వంలో చేసిన డెవలప్‌మెంట్‌‌ను పబ్లిసిటీ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు చెప్పేది అబద్ధమే అయినా ప్రజలు నమ్మే విధంగా చెబుతారు. అలా 4 సార్లు అబద్ధాలు చెప్పి గెలిచారు. డెవలప్‌మెంట్‌‌పై జగన్ దృష్టి పెట్టలేదని ఆరోపించారు.

January 30, 2025 / 07:35 AM IST