CTR: నగరి మున్సిపాలిటీ పుదుపేటలో జరిగిన రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలుపుతూ.. రంజాన్ నెలలో పాటించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మనిషిలో సహనం, దాతృత్వం, ఐక్యతను పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి వద్ద ఇవాళ సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుడ్డారెడ్డిగారిపల్లి సమీపంలో కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో పాలెం గడ్డ హరిజనవాడకు చెందిన నాగబాబు తీవ్రంగా గాయపడ్డాడు. స్థనికులు అతన్ని వెంటనే రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు సంబేపల్లి ఎస్సై రవికుమార్ తెలిపారు.
VZM: బొబ్బిలి పట్టణంలోని పలు హోటల్స్లో ఇవాళ విజలెన్స్ అధికారులు ఆక్షస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న 13 డొమస్టిక్ సిలెండర్లను సీజ్ చేసి, గ్యాస్ గోడౌన్కు తరలించారు. అక్రమ గ్యాస్ వినియోగాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజిలెన్స్ అధికారులు సింహాచలం, సతీష్ కుమార్, CSDT సాయికృష్ణ సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు.
KRNL: కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో, ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో అధికారులు ట్రాఫిక్ నిబ౦ధనలు, హెల్మెట్ వాడకం, మైనర్లు వాహనాలు నడపడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
SS: చిలమత్తూరు మండలం లాలేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామాలయం ఈ నెల 24న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గ్రామస్తుల కోరిక మేరకు చిన్నన్నపల్లికి చెందిన రమేష్ రెడ్డి రామాలయానికి ఎలక్ట్రానిక్ కంచు డోలు, వాయిద్యాన్ని శనివారం రాత్రి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా లాలేపల్లి గ్రామస్తులు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
PLD: పెదకూరపాడులో సీఎం సహాయనిధి కింద 11 మంది లబ్ధిదారులకు రూ.10.61 లక్షల చెక్కులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అందజేశారు. ఈ నిధి నిరుపేదలకు వరంగా మారిందని ఆయన అన్నారు. దీని ద్వారా నియోజకవర్గంలో వందలాది మంది మెరుగైన వైద్యం పొందుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు: జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. శనివారం ఆయన గుంటూరు సివిల్ సప్లైస్ ఎల్పీజీ ఏజెన్సీని తనిఖీ చేశారు. కనెక్షన్లు, బుకింగ్స్, సిలిండర్ల నిల్వలను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు అనవసర ఆందోళనతో ముందుగానే గ్యాస్ బుక్ చేసుకోవద్దని జేసీ సూచించారు.
ప్రకాశం: హనుమంతుడుపాడు మండలం పరిధిలోని వేములపాడు రోడ్డులో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా శనివారం ఎస్సై మాధవరావు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలను గుర్తించి ఈ-చలాన్లు విధించారు. ఈ తనిఖీల ద్వారా వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ELR: చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పదిమంది లబ్ధిదారులకు రూ.5,12,252ల చెక్కులను అందించారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు మెరుగైన వైద్యం అందజేయడం కోసం కృషి చేస్తుందని అన్నారు.
TPT: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు ఈస్ట్ హరిజనవాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లిపూడి బాలకృష్ణ (35) మనస్తాపానికి గురై స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
KRNL: రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఇవాళ మాధవరం నందు మీడియా సమావేశం నిర్వహించారు. 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించామని, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పారు.
VSP: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటిని బాధ్యతగా వినియోగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పిలుపునిచ్చారు. నగరానికి రోజుకు 400 MLD నీటి అవసరం ఉండగా, 2047 నాటికి 726 MLDకు పెరుగుతుందని తెలిపారు. వాటర్ సెక్యూరిటీ ప్లాన్, డ్రింక్ ఫ్రం ట్యాప్ పథకాలతో సరఫరా మెరుగుపరుస్తున్నామన్నారు. నీటి సంరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు.
AKP: నక్కపల్లి మండలం చందనాడలో ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఎస్పీ తుహీన్ సిన్హా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, భద్రత ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు.
NTR: జి.కొండూరులో పశువుల యజమానులకు పోలీసు వారు హెచ్చరికలతో కూడిన ఫ్లెక్సీలను శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. పశువులను కాపల కాయకుండా రోడ్లపై వదిలేనచో, పశువులను బందిల దొడ్లకు తరలించి, కేసులు నమోదు చేస్తామని పోలీసు వారు తెలిపారు. పశువుల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే, పశువుల యజమానులపై కేసు నమోదు చేసి జైలుకు పంపబడునని తెలిపారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్ ఏపీ మాజీ డీజీపీదొర మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని వారి నివాసానికి వెళ్లి, దొర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన సేవలు ఏపీ పోలీస్ శాఖకు చిరస్మరణీయమని కొనియాడారు