కృష్ణా: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 30మంది లబ్ధిదారులకు రూ. 41,61,456లను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.