PLD: ముప్పాళ్ల మండలం చాగంటివారి పాలెం గ్రామ శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఎస్సై పి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ మెరుపు దాడిలో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 18,070 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.