శ్రీకాకుళంలోని జి.టి.రోడ్డులోని జామియా మసీదులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడిపు నాయుడు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఐ తెలిపారు. అలాగే, ముస్లిం భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రశంసనీయమని కొనియాడారు.