CTR: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున పెద్దపంజాణి మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రాయలపేట జిట్టంవారి పల్లి వద్ద ఇద్దరు బైక్పై వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొంనిది. ఈ ఘటనలో పెనుగొలకలకు చెందిన సుబ్రహ్మణ్యం, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతూ మృతి చెందారు.
ATP: అనంతపురానికి చెందిన కొత్తకోట దామోదర్, బెంగళూరు మెజిస్ట్రిక్లోని హిజ్రాలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. మంగళవారం అనంతపురంలో దామోదర్ మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న హిజ్రాలకు తనవంతు సహాయం అందజేశానని అన్నారు. ఇకపైన కూడా ఏదైనా సమస్య వచ్చినా సంప్రదించాలని సూచించారు.
W.G: కాళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్, మోటార్ సైకిల్ దొంగతనాల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు వెంకటేష్, జోష్ణ దేవి, కృష్ణల నుంచి 166.5 గ్రాముల బంగారం, 5 మోటార్ సైకిళ్లు, రూ.2.58 లక్షల నగదు రికవరీ చేశారు.
ELR: మండవల్లి మండలంలోని భైరవపట్నం గ్రామంలో మంగళవారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసే షెడ్ అగ్ని ప్రమాదానికి గురి అయ్యింది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న కైకలూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ELR: జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో వివిధ కేడర్లలో పని చేయుచున్న సిబ్బందికి మంగళవారం పదోన్నతులు కల్పించారు. ఉద్యోగులకి జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మ శ్రీ పత్రాలను అందజేశారు. కారుణ్య నియామకం ద్వారా 55 మందిని ఒకేసారి నియమించడం రాష్ట్ర చరిత్రలోనే ఉమ్మడి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఆమె అన్నారు.
W.G: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తిని అభినందిస్తూ సీఐటీయు జిల్లా కమిటీ సభ నిర్వహించింది. మంగళవారం భీమవరం అంబేద్కర్ భవనంలో జరిగిన అభినందన సభకు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్ రాయ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గోపి మూర్తికి పూల మొక్కను అందించి అభినందించారు.
కృష్ణా: నూజివీడు పట్టణ పరిధిలోని శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయ సమీపంలో డ్రైనేజీ పూర్తిగా పూడుకుపోయి దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. మురుగు నీరు ముందుకు కదిలే అవకాశం లేక నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదన్నారు. డ్రైనేజీలోని చెత్తాచెదారం తొలగించి మురుగునీరు ముందుకు సాగేలా చేయాలని కోరారు.
NTR: వత్సవాయి మండలం ఇందుగపల్లి ఇసుక క్వారీలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణాను వైసీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరావు అడ్డుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం వందలాదిగా టిప్పర్లు క్వారీ నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల లోపల ఇసుకను లారీల ద్వారా వల్లభి మీదుగా ఖమ్మం తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని అన్నారు.
NTR: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగించారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఫిబ్రవరి 5లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28తో గడువు ముగియగా.. వచ్చే నెల 5 వరకు పొడిగించామన్నారు.
KRNL: ఆస్పరి మండల కేంద్రంలో ఉన్న శ్రీ మారెమ్మ అవ్వ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు గోవిందరాజులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి మంగళ, శుక్ర వారాల్లో కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారని అర్చకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శించుకున్న వారికి తీర్థప్రసాదాలు అందజేశామని తెలిపారు.
ASR: చింతపల్లి మండలంలోని పగలు రాత్రి తేడా లేకుండా పందుల సంచారం పెరిగిపోయింది. మండలంలోని చింతపల్లి పంచాయతీ పరిధి తపేలపేట వీధి పరిసర ప్రాంతంలో పందుల కారణంగా అపరిశుభ్రత పెరిగిపోయింది. గతంలో పందులను పట్టుకొని ఆడవులకు తరలించిన పందుల పెంపకదారుల్లో మార్పు రావడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ASR: పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గంజాయి నిల్వలను దహనం చేస్తున్నట్లు జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో సీజ్ చేసిన 35వేల కిలోల దహనం చేయనున్నారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు డీజీపీ తిరుమలరావు హాజరవుతారని పేర్కొన్నాయి.
ATP: గుత్తి ఆర్ఎస్లోని బాయ్స్ స్కూల్ సమీపంలో గోపి అనే భవన నిర్మాణ కార్మికుడు ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న 30 తులాల వెండి పట్టీలు, ఒక తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ASR: డుంబ్రిగూడ మండలంలో విషాదం చోటుచేసుకోంది. మండలంలోని కొర్ర గ్రామంలో ఆశ వర్కర్గా పనిచేస్తున్న గుజ్జెల గౌరమ్మ కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో కొర్ర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతిపట్ల తోటి సిబ్బంది సంతాపం ప్రకటించారు. అలాగే ఆమె అకాల మరణం జీర్ణించకోలేక పోతున్నామని తెలిపారు.
ASR: చింతపల్లి మండలంలోని లంబసింగికి వేలాదిగా పర్యాటకులు వస్తుంటారని, అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయమని విశాఖలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన గెస్ట్ హౌస్ ఆరేళ్లయినా పూర్తి చేయలేదన్నారు. బాత్ రూమ్స్, టాయిలెట్స్, కనీస వసతి సౌకర్యాలు, రెస్టారెంట్లు లేవన్నారు.