కోనసీమ: రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల కోసం కోనసీమ వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులు నిమిషం నిబంధనను పాటిస్తూ 10 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులందరూ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలన్నారు.