• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి’

KRNL: వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్సై సురేష్ బాబు అన్నారు. మండల కేంద్రమైన పాములపాడులో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా పాములపాడు గ్రామంలో హెల్మెట్ వాడకంపై జిల్లా పరిషత్ స్కూల్ మరియు శారదా స్కూల్ టీచర్లు, రెవెన్యూ సిబ్బందితో పాటు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

January 28, 2025 / 08:12 AM IST

భక్తిశ్రద్ధలతో షబ్- ఎ- మెరాజ్ వేడుకలు

ATP: గుత్తి కేబీఎన్ మసీదులో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు భక్తిశ్రద్ధలతో షబ్- ఎ- మెరాజ్ (పెద్దరాత్రి) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా హాఫీజ్ సాబ్ హుస్సేన్ మసీదులో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలు చేశారు. అనంతరం అల్లాను వేడుకుంటూ దువా చేశారు. హాఫీజ్ సాబ్ షబ్- ఎ- మెరాజ్ విశిష్టత గురించి తెలిపారు.

January 28, 2025 / 07:51 AM IST

తల్లిదండ్రుల మృతి.. అనాథగా మిగిలిన బాలుడు

BLGL: సీ. బెలగల్ మండలం పలుకుదొడ్డిలో బోయ బుజ్జమ్మ(25) కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. కనకవీడు గ్రామానికి చెందిన బోయ బుజ్జమ్మను పలుకుదొడ్డి గ్రామానికి చెందిన బోయ నాగేంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, బోయ నాగేంద్ర రెండేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ గ్రామస్థులు, బంధువులు కన్నీరుగా విలపిస్తున్నారు. 

January 28, 2025 / 07:37 AM IST

బావిలో పడి మహిళ మృతి

VZM: బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన వేపాడ మండలం బొద్దాంలో సోమవారం చోటు చేసుకుంది. బొద్దాంకు చెందిన కంచిపాటి వాణి (46) ఇటీవల కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతుకుతుండగా సోమవారం ఆమె ఇంటి ఆవరణలో గల బావిలో శవమై తేలింది. ఈ మేరకు ఎస్సై దేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

January 28, 2025 / 07:29 AM IST

బదిలీ అయిన ఏఎస్ఐ భాస్కరరావుకు సన్మానం

VZM: బొబ్బిలి పోలీసు స్టేషన్‌లో  ఏఎస్ఐగా పని చేసిన భాస్కరరావు ఆండ్ర పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో సోమవారం బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ కె.సతీష్ కుమార్, ఎస్ఐ రమేష్, సిబ్బంది ఆయనను సన్మానించారు. భాస్కరరావు ప్రజలు మన్ననలు పొందారని, భద్రతల పరిరక్షణకు పని చేశారని సీఐ సతీష్ కుమార్ తెలిపారు.

January 28, 2025 / 06:01 AM IST

‘గీత కార్మిక కులాలకు 2 మద్యం దుకాణాలు కేటాయింపు’

VZM: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గీత కార్మిక కులాలకు కేటాయించిన మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా బొబ్బిలి పట్టణంలో గీత కులస్తులకు రెండు వైన్ షాపులు కేటాయిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎక్సైజ్ సీఐ పి. చిన్నంనాయుడు తెలిపారు.

January 28, 2025 / 05:30 AM IST

ఏలూరు జిల్లాలో పర్యటించిన మంత్రి బీసీ

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి ఏలూరు-పెరికీడు NDB రోడ్లకు సంబంధించిన పనులను మంత్రి బీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్ల నిర్మాణ పనులపై స్థానిక అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

January 27, 2025 / 07:58 PM IST

పద్మ అవార్డు గ్రహీతలకు ఎంపీ అభినందనలు

NDL: తెలుగువారి ప్రతిభకు భారత ప్రభుత్వం పద్మ అవార్డులతో గౌరవించి, సత్కరించడం హర్షణీయమని నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి ‘X’లో ట్వీట్ చేశారు. ‘వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన దువ్వూరి నాగేశ్వరరెడ్డి, నందమూరి బాలకృష్ణ, మందకృష్ణ మాదిగ, మిరియాల అప్పారావు, కె.ఎల్.కృష్ణయ్య, మాడుగుల నాగఫణిశర్మ, పంచముఖి రాఘవచార్యులకు అభినందనలు’ అని పేర్కొన్నారు.

January 27, 2025 / 07:47 PM IST

నందీశ్వరునికి వెండి గంట బహుకరణ

VZM: విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో బహుళ త్రయోదశి సందర్బంగా ఆలయ అర్చకులు బసవ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సోమవారం నందీశ్వరునికి 110 గ్రాములు వెండి గంటను శ్రీకాంత్ అనే భక్తుడు ఆలయ ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి, అర్చకులు సోమశేఖర్ శర్మకు అందజేశారు.

January 27, 2025 / 07:26 PM IST

16వ రోజు 415 మంది అభ్యర్థుల ఎంపిక: ఎస్పీ

KRNL: కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల PMT/PET పరీక్షలు 16వ రోజు సోమవారం ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. 738 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హాజరైనట్లు పేర్కొన్నారు. 1,600 మీటర్ల రన్నింగ్‌లో 480 మంది అర్హత సాధించగా.. 100 మీటర్లలో 277 మంది, లాంగ్ జంప్‌లో 403 మంది అర్హత సాధించారన్నారు.

January 27, 2025 / 07:11 PM IST

మద్దికేరలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

KRNL: మద్దికేర మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మార్క్ షెడ్ రాజు ప్రారంభించారు. రైతులకు క్వింటాకు రూ. 7550కు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మండలంలోని రైతులు కందులను వ్యవసాయ కేంద్రానికి తెచ్చుకొని ఇక్కడే అమ్ముకోవాలని వ్యవసాయ అధికారి రవి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

January 27, 2025 / 07:10 PM IST

కిడ్నాపైన విద్యార్థుల ఆచూకీ లభ్యం

KRNL: కోడుమూరు నియోజవర్గం సీ.బెళగల్ మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. సోమవారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వారిని ఎమ్మిగనూరు టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు గూడూరు ఎస్సై తిమ్మయ్య వెల్లడించారు.

January 27, 2025 / 06:27 PM IST

‘జాతీయ సమావేశాన్ని జయప్రదం చేయండి’

KRNL: విజయవాడలో ఫిబ్రవరి 5న జరిగే జాతీయ సమావేశం జయప్రదం చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కర్నూల్ సెంట్రల్ ప్లాజా ఆఫీస్‌లో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం విజయవాడలో జరిగే సమావేశానికి రెండు రాష్ట్రాల ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు.

January 27, 2025 / 05:41 PM IST

త్వరలోనే బుచ్చి వైస్ ఛైర్మన్‌ల ఎంపిక

NLR: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు వైస్ ఛైర్మన్‌ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో బుచ్చి మున్సిపాలిటీకి వైస్ ఛైర్మన్‌ల ఎంపిక జరగాల్సి ఉంది. గత ప్రభుత్వంలో వైస్ ఛైర్మన్ లుగా షాహుల్, లలిత ఉండగా వారు రెండున్నర సంవత్సరాల తర్వాత రాజీనామా చేశారు. దీంతో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వైస్ ఛైర్మన్‌ల ఎంపిక‌కు బ్రేక్ పడింది.

January 27, 2025 / 05:22 PM IST

సంగంలో ఘనంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు

NLR: సంగం మండల కేంద్రంలో సోమవారం రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ నుండి జాతీయ రహదారి వరకు మహిళలతో హెల్మెట్ అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశారు. ప్రతీ ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

January 27, 2025 / 04:46 PM IST