W.G: బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఉమ్మడి గోదావరి జిల్లాల రెడ్డి సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి కృష్ణారెడ్డి కొనియాడారు. ఆదివారం మార్టేరులో ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన ధీరుడు నరసింహారెడ్డి అని కొనియాడారు.