NLR: చేపల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి తూకాలలో లోపాలు ఉన్న 15 కాంటాలను సీజ్ చేశామని తూనికుల అధికారి శాఖ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. తూనికలలో తేడాలు వస్తున్నాయని వినియోగదారుల ఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాలెం చాపల దుకాణాలపై దాడులు చేశారు. చేతి కర్ర కాంటాలు వాడొద్దని వ్యాపారస్తులకు సూచించారు. కాంటాలు కొనుగోలు చేసేటప్పుడు సీలు వేయించుకుని లైసెన్సులు తీసుకోవాలన్నారు.
VSP: గాజువాకలోని పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. వేగంగా వచ్చిన భారీ వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో, సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
SKLM: మందసలో వెలసిన శ్రీ వాసుదేవ పెరుమాళ్లు స్వామి వారిని పలాస టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, స్థానిక నాయకులుతో కలిసి స్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు నాగ రాజు తదితరులు ఉన్నారు.
ATP: గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన సిరిచాటి రవి, నాగరత్నమ్మ కుమార్తె నవనీత వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదివారం రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణం విశాఖపట్నంతో పోటీపడే సత్తా ఉందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఆదివారం జంగారెడ్డిగూడెం కూడా పట్టణంలో హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఆదాయం పెంచే విధంగా ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. దీంతో పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు.
ATP: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ, ఉపాధి హామీ అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
E.G: ప్రభుత్వం CPSను రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలని గోపాలపురం ASO జోడాల వెంకట్ కోరారు. CPS రద్దుకై విశాఖలో ఆదివారం జరుగుతున్న దీక్షకు గోపాలపురం నుంచి CPS ఎంప్లాయిస్ రాష్ట్ర సంఘ సెక్రటరీ రొయ్యల నాగ దుర్గారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శాంతి, తదితరులు వెళ్లారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
SKLM: శ్రీకాకుళంలోని సింహద్వారం వద్ద ఉన్న స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజగోపాల్ రావు రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి త్వమని కొనియాడారు. వరుసగా ఆరు పర్యాయాలు శ్రీకాకుళం ఎంపీగా సేవలందించారని.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ కల్యాణ మండపంలో వేద మంత్రాల నడుమ స్వామివారి స్వర్ణపుష్పార్చన జరిగింది.
CTR: నింద్ర మండలం కొప్పేడు గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మాణం జరగనున్న విలేజ్ హెల్త్ సెంటర్ (V.H.C)కు భూమి పూజ కార్యక్రమంలో ఆదివారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్లో గ్రామస్తులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందించడానికి ఈ కేంద్రం ముఖ్య పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు.
ATP: తాడిపత్రి మండలంలోని హుస్సేనాపురం గ్రామ ఎస్సీ కాలనీలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు కాకర్ల రంగనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
VZM: బొబ్బిలి తారక రామ కాలనీను ఆదివారం పోలీసులు చుట్టుముట్టారు. డీఎస్పీ భవ్య రెడ్డి ఆదేశాలు మేరకు టిఆర్ కాలనీలో పట్టణ, రూరల్ సీఐలు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచితులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. నేరాలను నివారించేందుకు అనుమానిత గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
PPM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు 28 వ వార్షికోత్సవం సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుటుంబ సమేతంగా అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రములను సమర్పించారు. ముందుగా కమిటీ సభ్యులు, ఆలయ పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందారు.
KDP: పెండ్లిమర్రి సమీపంలోని భైరవగుట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కడప వైపు నుంచి వేంపల్లి వైపు వెళ్తున్న మూడు స్కూటర్లను ప్రమాదవశాత్తు వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు ముగ్గురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AKP: కోటవురట్ల మండలం పాములవాక పశువైద్యశాలకు వచ్చిన పశువుల దాణా లారీని వైసీపీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు అడ్డుకున్నారు. లారీలో పశువుల దాణా బస్తాలను అర్హులైన YCP సానుభూతిపరులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో గ్రామానికి రెండు పశువుల దాణా లారీలు రాగా వాటిని అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో టీడీపీ వారికి పంపిణీ చేశారని ఆరోపించారు.