E.G: రాజమండ్రిలో ఆదివారం మాంసం ధరలు భారీగా పెరిగాయి. రవాణా ఖర్చులు, కోళ్ల దాణా రేట్లు పెరగడంతో చికెన్ స్కిన్లెస్ కిలో రూ.380, స్కిన్తో రూ. 360కు చేరింది. లైవ్ కోడి రూ.230కు విక్రయిస్తున్నారు. మరోవైపు మటన్ ధర కిలో రూ.1100కు చేరడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలతో మాంసం కొనలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
VZM: మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఉత్తరాంధ్ర భక్తులు తరలిరావాలని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు శనివారం కోరారు. కళ్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.1500 టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్లైన్లో ఆలయం వద్ద టికెట్లు లభ్యమవుతాయని పాల్గొనే వారికి శేషవస్త్రాలు, ప్రసాదం అందిస్తామన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఇవాళ అమ్మవారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు రుద్రాభిషేకం, మహా మంగళహారతి వంటి పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లలో నిల్చొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
BPT: పర్చూరు మండలం నూతలపాడులో గ్రామాభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఎస్సీ కాలనీలో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి పీఎసీఎస్ ఛైర్మన్ విన్నకోట సతీశ్, స్థానిక నేతలు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మద్దతుతో గ్రామంలో రహదారి సౌకర్యాలు మెరుగుపర్చే దిశగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కల్తీ టీ పొడి విక్రయాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్కెట్లో నకిలీ టీ విస్తృతంగా అమ్ముడవుతోందని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని ఎమ్మెల్యే వెల్లడించారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
KDP: ప్రొద్దుటూరు మండల పరిధిలోని చౌడూరు పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు గ్రామీణ ఠాణా సీఐ నాగభూషణ్ తెలిపారు. మొత్తం 5 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనుమతి లేనిచోట అక్రమంగా తవ్వకాలు చేసి ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.
అన్నమయ్య: రాయచోటి బైపాస్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కిరెడ్డిపల్లి నుంచి వస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సత్యసాయి: పెనుకొండలోని సీపీఐ కాలనీలో ‘ఆపరేషన్ వజ్రపహార్’ కింద పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా డ్రోన్ కెమెరా సహాయంతో గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అనుమానిత వ్యక్తుల యొక్క ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
NLR: విడవలూరులోని వావిల్ల రోడ్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. లారీలు, గోన సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
E.G: జిల్లాలోని రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే అర్జీల స్థితి, నమోదు వివరాల కోసం 1100కు కాల్ చేయవచ్చని వెల్లడించారు.
విశాఖలో గంజాయి, ఇతర నార్కోటిక్ డ్రగ్ కట్టడిలో భాగంగా RTC కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్, తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ బృందాలు నిఘా చేపట్టాయి. శనివారం జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 2 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని తదుపరి చర్యలకై కంచరపాలెం పోలీసులకు అప్పగించారు.
ELR: ద్విచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు, అదెప్పుడు ద్విచక్ర వాహనంలో అందుబాటులో ఉండాలని పెదపాడు ఎస్సై శ్రీను అన్నారు. పెదపాడులో శనివారం రాత్రి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. రహదారి పైకి వచ్చే క్రమంలో అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు.
కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్కు ఆదివారం రాజమండ్రికు చెందిన హనుమంశెట్టి దుర్గాప్రసాద్ దంపతులు రూ.70,001, వానపల్లికి చెందిన కర్రీ రామారెడ్డి దంపతులు రూ.25,116లు విరాళంగా ఆలయ డీసీ చక్రధరరావుకు అందజేశారు. ముందుగా వారు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ATP: కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆదివారం కంబదూరు మండలంలో పర్యటిస్తారని పార్టీ కార్యాలయ ప్రతి నిధులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం ఎర్రబండ గ్రామంలో వైసీపీ చేపట్టిన లక్ష పోస్టుకార్డుల ఉద్యమంలో పాల్గొంటారన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.