ASR: చింతూరు మండలం సింగనగూడెం టర్నింగ్ వద్ద తమిళనాడు నుంచి జైపూర్కు వెళ్తున్న కారు ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
TPT: వెంకటగిరి పట్టణంలోని 4 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు 23వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు అన్ని విధాల చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకున్నారు. వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో మొత్తం జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలు 6 ఉన్నాయి. వెంకటగిరిలో మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సుమారు 1300 మంది విద్యార్థులు హాజరవుతారు.
CTR: పాలసముద్రం ప్రభుత్వ జూ.కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘా, 144 సెక్షన్ పెట్టామని ప్రిన్సిపల్ హేమలత తెలిపారు. రేపటి నుంచి 196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు పెర్కొన్నారు. పరీక్షల గదుల్లో గాలి, వెలుతురు, తాగునీరు, మూత్ర శాలల పారిశుద్ద్యం ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని పలు వార్డులలో రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమయ్యే వనరులు సమకూర్చే దిశగా పనిచేస్తామన్నారు.
NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్లో నగర కమిషర్ బాలకృష్ణ ఆధ్వర్యలో హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ఆటలు, డాన్స్లు వేయగా మెప్మా ఆర్పీలు పాటలతో సందడి చేశారు. వారం రోజుల నుంచి పని ఒత్తిడితో జీవిస్తూ ఆదివారం నాడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనసు ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి నెలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
E.G: పాత రుసుములు ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు వ్యాపారస్తులకు ఆదివారం పిలుపునిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో భారీ పెనాల్టీ పడుతుందని సిబ్బంది హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఫీజులు తగ్గింపు అధికార పక్షం, ప్రతిపక్షం ఆమోదంతోనే జరిగిందన్నారు.
ATP: గుత్తికొండలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అంజి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 11:30 గంటలకు శ్రీ భూనీలా సమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.
కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి అమలాపురం వాస్తవ్యులు ఎంఎన్ సోమనాథ శాస్త్రి కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని ఆదివారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ని ఆయన కార్యాలయంలో ఆదివారం ఎచ్చెర్ల కి చెందిన శ్రీ సాయి కళింగ వైశ్య సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు తమ సమాజ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కమ్యూనిటీ హాలు కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.
సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో మాజీ మున్సిపల్ గ్రీన్ పార్క్ నాగరాజు ఆధ్వర్యంలో లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ బసవనపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. బసవనపల్లి నుంచి పెద్ద చెరువు కింద నుంచి కంచిసముద్రం వెళ్లే దారికి పూజలు చేసి పనులు మొదలుపెట్టారు.
కృష్ణా: అవనిగడ్డలో నూతనంగా నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ లైబ్రరీ కం రీడింగ్ హాలును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. 2016-17 ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా అప్పటి ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మంజూరు చేసిన రూ.5 లక్షలు, సంఘ శాశ్వత అధ్యక్షులు కాశీభట్ల నాగేశ్వరరావు విరాళం రూ.4 లక్షలు, సభ్యుల విరాళాలతో ఈ భవనం నిర్మించారు.
CTR: ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. నేరాలు అక్రమ రవాణా అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ తనిఖీల్లో 10 ద్విచక్ర వాహనాలు, 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ELR: గణపవరం శ్రీ చింతలపాటి బాపిరాజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈనెల 23వ తేదీన నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతాయని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ కె నాగేశ్వరరావు శర్మ ఆదివారం తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్ధులు 377 మంది, వొకేషనల్ విద్యార్ధులు 34 మంది పరీక్షలకు హాజరవుతారన్నారు.
CTR: కాణిపాకం వినాయక స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రముఖులు ప్రత్యేక దర్శనం నిర్వహించారు.కేంద్ర మంత్రి రామ్మోహన్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈఓ పెంచల కిషోర్, ఛైర్మన్ మణి నాయుడు ఆలయ సంప్రదాయాల ప్రకారం వారికి ఘన స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
CTR: అరగొండలోని పురాతన చరిత్ర కలిగిన శివాలయంలో ఆదివారం ఉదయం కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అపోలో అధినేత ప్రతాప్ సి రెడ్డి సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.