CTR: ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. నేరాలు అక్రమ రవాణా అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ తనిఖీల్లో 10 ద్విచక్ర వాహనాలు, 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.