• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలకు సన్నాహాలు

ATP: మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో మండల కన్వీనర్లు, ఇన్‌ఛార్జిలతో సమీక్షించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామస్థాయిలో ఉత్సాహంగా వేడుకలు జరిపి కార్యకర్తల ఐక్యతను చాటాలని ఆమె ఆదేశించారు.

March 26, 2026 / 02:53 PM IST

గాయపడిన ఉద్యోగిని పరామర్శించిన దివాకర్ రెడ్డి

TPT: రోడ్డు ప్రమాదంలో గాయపడి స్థానిక హోలియోస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తుడా ఉద్యోగి దుర్గాప్రసాద్‌ను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరామర్శించారు. దుర్గాప్రసాద్ తిరుపతి రూరల్ మండలంలోని సీ గొల్లపల్లి గ్రామానికి చెందినవారు. ఆసుపత్రికి చేరుకున్న ఆయన, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

March 26, 2026 / 02:50 PM IST

కలెక్టర్‌ని కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి

KKD: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 3 మండలాల పరిధిలో ఉత్పత్తి అయ్యే 94 వేల మెట్రిక్ టన్నులలో 85 వేల టన్నుల వరిని ప్రభుత్వం కొనాలని కోరారు.

March 26, 2026 / 02:44 PM IST

అస్తవ్యస్తంగా డ్రైనేజీలు.. పట్టించుకోని అధికారులు

NDL: బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. డ్రైనేజీలను శుభ్రం చేయించాలని ప్రజలు కోరారు.

March 26, 2026 / 02:41 PM IST

స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీని సందర్శించిన పీడీ

VZM: కే.ఎల్.పురంలోని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీని ఐసీడీఎస్ పీడీ బాలమణి గురువారం సందర్శించారు. అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల హెల్త్ డీటెయిల్స్‌ను, హెల్త్ రిపోర్ట్స్‌ను పరిశీలించారు. అలాగే అక్కడ ఉన్న స్టాఫ్‌తో మాట్లాడి పిల్లలకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లలను మంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలన్నారు.

March 26, 2026 / 02:40 PM IST

రొయ్యల పెంపకంపై శిక్షణా తరగతులు

W.G: ఉండి కృషివిజ్ఞాన కేంద్రంలో రొయ్యల పెంపకంలో అనుసరించవలసిన మేలైన యాజమాన్యం పద్ధతులపై గురువారం శిక్షణా తరగతులను ప్రారంభించినట్టు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మల్లిఖార్జునరావు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక రెవిన్యూ ఉన్న రొయ్యల సాగులో రైతులకు కొన్ని మెలుకువలు తెలుపుతాము అన్నారు. ఐదు రోజుల పాటు శిక్షణ జరుగుతుంది చెప్పుకొచ్చారు.

March 26, 2026 / 02:39 PM IST

మృతి చెందిన కోళ్లను పరిశీలించిన అధికారులు

సత్యసాయి: సోమందేపల్లి మండలం రేణుకానగర్‌లో గురువారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందిన నాటు కోళ్లను వైద్య సిబ్బంది పరిశీలించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతి చెందిన కోళ్లను గుంత తవ్వి బూడ్చివేశారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి పీహెచ్ఓ రవీంద్రతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

March 26, 2026 / 02:38 PM IST

‘ఇంటి పన్ను చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేయండి’

ELR: ఇంటి పన్ను చెల్లించకపోతే వారికి ఫైనల్ నోటీసులు జారీ చేసి ఆస్తులను జప్తు చేయాలని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. గురువారం ఆయన కార్యాలయం నుంచి మండలంలో పంచాయతీ అభివృద్ధి అధికారులకు ఇంటి పన్నుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పన్ను చెల్లించకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుళాయిలు డమ్మీతో పాటు పౌర సేవలు నిలిపివేయాలన్నారు.

March 26, 2026 / 02:37 PM IST

మదనపల్లెలో రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం

అన్నమయ్య: మదనపల్లెలోని శ్రీ వరాల (ఎగువ) ఆంజనేయస్వామి దేవస్థానంలో మార్చి 27న శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఉదయం 5 గంటలకు గోపూజ, 7.20 గంటలకు కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం ఊరేగింపు, భజనలు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 2 నుంచి 41 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

March 26, 2026 / 02:35 PM IST

దొరవారిసత్రంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

TPT: దొరవారిసత్రం ఎంపీడీవో కార్యాలయంలో ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని, మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టుమిషన్లు దోహదమని తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

March 26, 2026 / 02:35 PM IST

లయన్స్ ఆస్పత్రికి విరాళం

VSP: లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎన్వేద థెరప్యూటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.4.59 లక్షల విరాళం అందించింది. సంస్థ డైరెక్టర్ కృష్ణారావు ఈ మొత్తాన్ని హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావుకు అందజేశారు. ఈ నిధులతో ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ, యూరిన్ ఎనలైజర్లు కొనుగోలు చేయనున్నారు.

March 26, 2026 / 02:31 PM IST

బస్సు ప్రమాదం.. గుడ్లూరు మహిళకు గాయాలు

NLR: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గుడ్లూరు మండలం వెంకంపేటకు చెందిన తుపాకుల రత్తమ్మ గాయపడ్డారు. ఐదేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. మరో ఇద్దరితో కలిసి బస్సులో దుత్తలూరుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆమెతో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. రత్తమ్మతో పాటు మరొకరు మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

March 26, 2026 / 02:31 PM IST

కోడిగుడ్డు ధర పతనం.. పౌల్ట్రీ ఆందోళన

ఉమ్మడి జిల్లాలో కోడిగుడ్డు ధరలు పడిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో రూ.7 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 4 నుంచి రూ. 4.5కు తగ్గిందని వారు తెలిపారు. చికెన్ ధరలు పెరిగినా, ఎగుమతులు తగ్గిపోవడం వల్ల గుడ్లకు డిమాండ్ పడిపోయి భారీ నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు చెప్పుకొచ్చారు.

March 26, 2026 / 02:30 PM IST

నారా లోకేష్‌ను కలిసిన నిమ్మల కిష్టప్ప

సత్యసాయి: TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప గురువారం ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన కుమారుడు నిమ్మల అంబిరీష్‌తో కలిసి అమరావతిలో మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా వినతులు అందజేశారు.

March 26, 2026 / 02:30 PM IST

తిమ్మాయపాలెంలో ఇంటి పన్ను 100 శాతం వసూళ్లు

BPT: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామపంచాయతీలో గురువారం హౌస్ టాక్స్ వసూళ్లను జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఈరోజు రూ.11,250 హౌస్ టాక్స్ వసూలై, మొత్తం 31 అసెస్మెంట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. చలివేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.

March 26, 2026 / 02:28 PM IST