CTR: పుంగనూరులో హనుమంతరాయుని దిన్నె శ్రీ వీరాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను వేదపండితులు అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజపటాన్ని ఎగురవేశారు.