EG: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు , కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు మంత్రి కందుల దుర్గేష్ని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం రాజమండ్రి మంత్రి నివాసంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు . క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, వారి సమస్యలను సకాలంలో గుర్తించి త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు.