W.G: నరసాపురం-మాధవాయి పాలెం ఫెర్రీ వేలం పాట వాయిదా పడింది. స్థానిక MPDO కార్యాలయంలో గురువారం నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ అనివార్య కారణాల వల్ల నిలిపివేసినట్లు జాయింట్ కమిటీ సభ్యులు తెలిపారు. MPDO అనారోగ్యానికి గురవ్వడం, జిల్లా పరిషత్ CEO అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి వేలం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.