కృష్ణా: గుడివాడ (M) లింగవరం గ్రామం నుంచి మల్లాయిపాలెం టిడ్కో కాలనీ వరకు సామాజిక కార్యకర్త రవికిరణ్ గురువారం పాదయాత్ర చేశారు. లింగవరం గ్రామంలో ఎప్పటినుండో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల మార్పు కోసం గతంలో అర్జీలను సమర్పించానని అన్నారు. బైపాస్ రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఈఈ శ్రీనివాస్కి అర్జీని సమర్పించడం జరిగిందని తెలిపారు.